Chandrababu Naidu : నా వ‌ల్ల‌నే హైద‌రాబాద్ అభివృద్ది

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న హైద‌రాబాద్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మ‌రోసారి. తాను లేక పోతే హైద‌రాబాద్ అన్న‌ది డెవ‌ల‌ప్ అయ్యేది కాద‌న్నారు. త‌న ముందు చూపు వ‌ల్ల‌, తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల వ‌ల్ల‌నే ఇవాళ హైద‌రాబాద్ అన్ని రంగాల‌లో ముందంజ‌లో కొన‌సాగుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Chandrababu Naidu Words about Gaddar

గ‌తంలో హైద‌రాబాద్ ను ఎవ‌రూ ప‌ట్టించు కోలేద‌న్నారు. కానీ తాను వ‌చ్చాక హైద‌రాబాద్ సీన్ మారింద‌న్నారు. అంత‌కు ముందు ఇటీవ‌లే మృతి చెందిన ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ కుటుంబాన్ని చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గాయ‌కుడి ఫ్యామిలీకి అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ప్ర‌జ‌ల కోసం త‌న జీవితాంతం పాట‌ల‌తో అంకితం చేసిన గొప్ప గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అని కొనియాడారు.

రాజ‌కీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, సైద్ధాంతికంగా విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ ఎవ‌రి రంగంలో వారు త‌మ‌దైన రీతిలో ప‌ని చేస్తుంటార‌ని పేర్కొన్నారు. ఇవాళ గ‌ద్ద‌ర్ లాంటి గాయ‌కుడు , యోధుడు లేక పోవ‌డం త‌న‌ను బాధ‌కు గురి చేసింద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

Also Read : Vyooham Movie Teaser-2 : వ్యూహం మూవీ టీజ‌ర్-2 రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!