Chegondi Harirama Jogaiah: ఎన్డీఏ కూటమిపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు !

ఎన్డీఏ కూటమిపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు !

Chegondi Harirama Jogaiah: జనసేన – తెలుగుదేశం పార్టీ – బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్రపోషించాలని ఆయన ఆకాంక్షించారు. సోమవారం నాడు పాలకొల్లులో హరిరామ జోగయ్య అధ్యక్షతన ఏపీ కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. కాపు బలిజ తెలగ ఒంటరి కులస్థుల సంక్షేమమే ధ్యేయంగా కాపు బలిజ సంక్షేమ సేన పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో గెలవడానికి కాపు బలిజ సంక్షేమ సేన కృషి చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా జనసేన మెరుగైనా పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాపు బలిజ కులస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామన్నారు.

Chegondi Harirama Jogaiah Comment

రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అన్నిచోట్ల సమైక్యంగా తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేస్తుందని వివరించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కాపు బలిజ కులస్తులు అన్ని విధాలా కృషి చేయాలన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో… జనసేన పార్టీకి కాపు బలిజ సంక్షేమ సంఘం అలా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో 25 శాతం ఉన్న కాపులకు బీసీలతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు అందించాలని తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో అన్నిచోట్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవడానికి అన్ని విధాలా సహకరించాలని హరిరామ జోగయ్య కోరారు.

Also Read : Harish Rao Slams : కాంగ్రెస్ అబద్దాలతో అధికారంలోకి వచ్చిందంటున్న మాజీ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!