CM Revanth Reddy : ద‌ర‌ఖాస్తుల అమ్మ‌కం సీఎం ఆగ్ర‌హం

ప్ర‌జాపాల‌న అప్లికేష‌న్స్ అమ్మ‌కం

CM Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు ఆరు గ్యారెంటీల అమ‌లుకు సంబంధించి శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా డిసెంబ‌ర్ 28 నుంచి జ‌న‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు ప్ర‌జా పాల‌న ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. రాష్ట్రంలోని గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌లోని వార్డుల వారీగా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్నారు.

CM Revanth Reddy Serious

కాగా ఆన్ లైన్ లో కాకుండా కేవ‌లం ఆఫ్ లైన్ లో మాత్ర‌మే స్వీక‌రించాల‌ని ఆదేశించ‌డంతో తెల్ల‌వారు జాము నుంచి జ‌నం బారులు తీరారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో ప‌లు చోట్ల ప్ర‌జా పాల‌న ద‌ర‌ఖాస్తులు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి రుసుము లేకుండా అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించింది స‌ర్కార్.

ప్ర‌భుత్వ రూల్స్ కు విరుద్దంగా అప్లికేష‌న్స్ కు కొంద‌రు డ‌బ్బులు తీసుకుంటున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియ‌స్ అయ్యారు. ద‌రఖాస్తుదారుల‌కు అవ‌స‌ర‌మైన‌న్ని అప్లికేష‌న్స్ అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. రైతుబంధు, పెన్ష‌న్ల‌పై అపోహ‌ల‌కు గురి కావ‌ద్ద‌ని సూచించారు.

పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయ‌ని.. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాల‌ని అనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి.

Also Read : Pawan Kalyan : జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!