Nagarjuna Amala : రేవంత్ ను క‌లిసిన నాగార్జున‌..అమ‌ల‌

మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశామ‌ని ప్ర‌క‌ట‌న

Nagarjuna Amala : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డిని వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు క‌లుస్తున్నారు. మొన్న సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఇరువురి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో చ‌ర్చ‌లు జ‌రిగాయి.

Nagarjuna Amala Met Cm Revanth Reddy

గ‌తంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. తాను ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో క‌లిపేశారు. ఆయ‌న‌ను న‌మ్ముకున్న వారికి ఏమీ చేయ‌లేక పోయార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఆపై తిరిగి సినీ రంగంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

తాజాగా ఎన్నిక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిరంజీవి మౌనంగా ఉన్నా ఆయ‌న త‌మ పార్టీకి చెందిన వారేనంటూ పేర్కొన్నారు. దీంతొ ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత లోతుగా తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా శ‌నివారం ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌(Nagarjuna), భార్య అమ‌ల మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ కు పూల బోకే అంద‌జేశారు.

Also Read : CM Revanth Reddy : ద‌ర‌ఖాస్తుల అమ్మ‌కం సీఎం ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!