Kathi Karthika Goud : ప్ర‌చార క‌మిటీలో క‌త్తి కార్తీక గౌడ్

ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ

Kathi Karthika Goud : కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్న మ‌హిళా నాయ‌కురాలు క‌త్తి కార్తీక గౌడ్ కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది హ‌స్తం పార్టీ. రాష్ట్ర ప్ర‌చార క‌మిటీని ప్ర‌క‌టించింది. చైర్మ‌న్ గా మాజీ ఎంపీ మ‌ధు యాష్కిని , వైస్ చైర్మ‌న్ గా మాజీ ఎంపీ పొంగులేటికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కార్య‌వ‌ర్గ క‌మిటీలో 21 మందిని ఎంపిక చేసింది. కార్య‌వ‌ర్గ స‌భ్యురాలిగా క‌త్తి కార్తీక గౌడ్ ను నియ‌మించింది. ఈ మేర‌కు అధికారికంగా టీపీసీసీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

బుల్లి తెర‌పై యాంక‌ర్ గా గుర్తింపు పొందారు క‌త్తి కార్తీక గౌడ్(Kathi Karthika Goud). ప్ర‌స్తుతం బీఆర్ఎస్ లో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ప‌ద్మా రావు గౌడ్ కు మ‌నుమ‌రాలు కావ‌డం విశేషం. దుబ్బాక ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌త్తి కార్తీక గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అనంత‌రం భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. కానీ అక్క‌డ కొద్ది కాలం పాటే ఉన్నారు.

నిజామాబాద్ మాజీ ఎంపీ మ‌ధు యాష్కి గౌడ్ ప్రోద్భ‌లంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంట‌నే కీల‌క‌మైన నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో కంటిన్యూగా రాహుల్ వెంట న‌డిచారు క‌త్తి కార్తీక గౌడ్. దీంతో రాహుల్ ఆశీస్సులు మెండుగా ఉండ‌డం తో పాటు యాంక‌ర్ గా స‌క్సెస్ కావ‌డం కూడా ప్ర‌చార క‌మిటీలోకి వ‌చ్చేలా చేసింది.

Also Read : Ponguleti Srinivas Reddy : పొంగులేటికి కీల‌క ప‌ద‌వి

Leave A Reply

Your Email Id will not be published!