భార‌తీయ సినిమాను షేక్ చేస్తున్న గీతూ మోహ‌న్ దాస్

సంచ‌ల‌నంగా మారిన య‌శ్, కియారా టాక్సిక్ మూవీ

బెంగ‌ళూరు : ఇండియ‌న్ స్టార్ హీరో య‌శ్ , కియారా అద్వానీ, న‌య‌న‌తార త‌దిత‌ర న‌టీ న‌టుల‌తో కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. ఈ సినిమాకు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌ను మూస ధోరణులను బద్దలు కొట్టారు . తాజాగా మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది. సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంతో గీతూ మోహన్‌దాస్ సినిమా నిర్మాణంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. సాహసోపేతమైన కథాంశం, సన్నిహిత సన్నివేశాలు , విభిన్నమైన కథన శైలి కేవలం రామ్ గోపాల్ వర్మ లేదా సందీప్ రెడ్డి వంగా వంటి పురుష దర్శకులకే పరిమితం కాదని ఆమె నిరూపిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. చాలా మంది గీతూను భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యంత సాహసోపేతమైన (లేదా వివాదాస్పదమైన) చిత్రనిర్మాతలతో పోల్చుతున్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ అభిప్రాయం ప్రకారం గీతూ సరికొత్త మార్గాన్ని సుగమం చేశారు. ఆమె అన్ని సంప్రదాయ నియమాలను బద్దలు కొట్టారు. టీజర్ , ప్రచార వీడియోలు అద్భుతమైన స్పందనను పొందాయి, సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇది ఇటీవలి కాలంలో అత్యధికంగా వీక్షిస్తున్న‌ టీజర్‌లలో ఒకటిగా నిలిచింది, అలాగే అనేక ట్రోల్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు దీనిని ఆదరించారు అని ఆయన పేర్కొన్నారు . గీతూ మోహ‌న్ దాస్ సినిమాటిక్ అభిరుచి ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నటన నేపథ్యం నుండి వచ్చారు ఆమె భర్త సినిమాటోగ్రాఫర్. ఆ కలయిక సినిమాలోని దృశ్యపరమైన వైభవం , భావోద్వేగ లోతులో ప్రతిబింబిస్తుందని అన్నారు.
కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ , నయనతార పోషించిన మహిళా పాత్రలు బలమైన, ఆత్మవిశ్వాసం కలిగిన స్వతంత్ర మహిళలుగా చూపబడటం వల్ల గణనీయమైన ఆసక్తిని రేకెత్తించాయని కూడా ఆయన పేర్కొన్నారు. భారీ అభిమానగణం కలిగిన సూపర్ స్టార్ యష్ ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సన్నిహిత సన్నివేశంలో నటించలేదని, అందుకే ఇది మరింత ఆకర్షణీయంగా మారిందని శ్రీధర్ తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!