K. V. P. Ramachandra Rao: వైసీపీ ప్రభుత్వంపై కేవీపీ సంచలన వ్యాఖ్యలు !

వైసీపీ ప్రభుత్వంపై కేవీపీ సంచలన వ్యాఖ్యలు !

K. V. P. Ramachandra Rao: సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్ మీడియలో పోస్టులు పెడితే ప్రభుత్వాధినేత పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు(K. V. P. Ramachandra Rao) మండిపడ్డారు. తల్లి, చెల్లిని సంరక్షించలేని వారి కంటే అసమర్ధులు ఇంకెవరూ ఉండరని సీఎం వైఎస్ జగన్ పై ఆయన ద్వజమెత్తారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేవీపీ రామచంద్రబాబు మాట్లాడుతూ… “పోలవరం నిర్మాణాన్ని ఆపేసిన వైసీపీ ప్రభుత్వం… ఆ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని ఆరోపించారు. ఏపీలో ఇసుక, మద్యం విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరగుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే వారికి వాటాలు వెళ్తున్నాయని అనుమానం వ్యక్తం చేసారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో మంత్రులను అరెస్ట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసిందని ఆయన ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో బీజేపీకు వాటాలు అందుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేసారు.

K. V. P. Ramachandra Rao – ఏపీకు మోదీ తీరని అన్యాయం చేసారు – కేవీపీ

నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకు తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కేవీపీ రామచంద్ర రావు ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని,‌ పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారని ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో హామీలు అమలు కోసం తన శక్తికి మించి పోరాడానని తెలిపారు. మోదీ అమరావతికి పవిత్ర జలాలకు బదులు కలుషిత జలాలు తీసుకొచ్చినట్లుందని ఆరోపించారు.

Also Read : Tirupati By-election: తిరుపతి దొంగ ఓట్లు కేసులో మరో అధికారిపై వేటు !

Leave A Reply

Your Email Id will not be published!