క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌

ఆవిష్క‌రించి బాగుందంటూ న‌టి కితాబు

హైద‌రాబాద్ : న‌టి శ్రీ‌లీల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె క‌ళ్యాణ్ బంగారు ఆభ‌ర‌ణాల షో రూమ్ ను ఆదివారం మేడిప‌ల్లిలో ప్రారంభించారు. అంత‌కు ముందు భారీ ఎత్తున ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య రిబ్బ‌న్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్బంగా షో రూమ్ సూప‌ర్ గా ఉందంటూ కితాబు ఇచ్చారు ఈ అందాల ముద్దుగుమ్మ‌. సంప్రదాయం, ఆధునికతను మేళవించి, ఆభరణాల షాపింగ్‌లో వినియోగదారులకు ఉత్తమమైన వాటిని అందిస్తోంది క‌ళ్యాణ్ ఆభ‌ర‌ణాల సంస్థ‌. ఆభరణాల పరిశ్రమలో ప్రపంచ అగ్రగామి అయిన కళ్యాణ్ జ్యువెలర్స్ హైదరాబాద్‌లోని మేడిపల్లిలో తన కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించడంతో తెలంగాణలో తన విస్తరణలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.

సాంప్రదాయ హస్తకళను ఆధునిక షాపింగ్ అనుభవంతో సజావుగా మేళవించే ప్రీమియం రిటైల్ వాతావరణాన్ని అందిస్తూ వస్తోంది సంస్థ‌. తెలంగాణ మార్కెట్‌కు కళ్యాణ్ జ్యువెలర్స్ నిబద్ధతను ఈ ప్రారంభోత్సవం నొక్కి చెబుతోంది. ఈ షోరూమ్ చక్కటి ఆభరణాల కోసం ఒక సమగ్ర గమ్యస్థానంగా రూపొందించబడింది, ఇందులో బ్రాండ్ సిగ్నేచర్ హౌస్ లేబుల్స్ విస్తృతమైన పోర్ట్‌ఫోలియో ప్రదర్శించ బడుతుంది. ఈ సంద‌ర్భంగా న‌టి శ్రీలీల మాట్లాడుతూ కళ్యాణ్ జ్యువెలర్స్ వారి ఈ అందమైన షోరూమ్‌ను ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. . నమ్మకం, పారదర్శకత , వినియోగదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధానం పట్ల ఈ బ్రాండ్ నిబద్ధతను నేను నిజంగా ప్రశంసిస్తున్నానని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!