Kangana Ranaut: భారత తొలి ప్రధాని బోస్‌ అంటూ నోరు జారిన కంగన ! ఆడుకుంటున్న నెటిజన్లు !

భారత తొలి ప్రధాని బోస్‌ అంటూ నోరు జారిన కంగన ! ఆడుకుంటున్న నెటిజన్లు !

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి కంగనా రనౌత్(Kangana Ranaut) నోరు జారారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నోరు జారారు. దీనితో కంగన చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ… ‘‘మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు..?’’ అని వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడిన ఆయన్ను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని అన్నారు. అయితే యాంకర్ ఆమె మాటలను సరిచేశారు. అయినప్పటికీ కంగన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారి మాటలు తేలిగ్గా తీసుకోవద్దని… వీరంతా ఎక్కడ చదువుకున్నారంటూ విపక్ష నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే దేశ ప్రజల పరిస్థితి ఏంటో..? అంటూ కామెంట్లు పెట్టారు.

Kangana Ranaut Comments Viral

గతంలోను ఈ నటి ఇదేతరహా వ్యాఖ్యలు చేశారు. 2014లో ప్రధాని మోదీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ వ్యాఖ్యలు చేసి… విమర్శల పాలయ్యారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అప్పట్లో పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. ఇదిలాఉంటే.. మండి నియోజకవర్గానికి జూన్‌ ఒకటిన ఓటింగ్ జరగనుంది. రాజవంశీయులకు కంచుకోటైన ఈ స్థానంలో కంగన పోటీ ఆసక్తిగా మారింది.

Also Read : Rahul Gandhi: ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!