Kodali Nani : బాబు..పీకే భేటీపై నాని సెటైర్

జ‌గ‌న్ ను పీకేది ఏమీ లేదు

Kodali Nani : కృష్ణా జిల్లా – వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాజాగా చంద్ర‌బాబు నాయుడితో ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ , ఐప్యాక్ చీఫ్ ప్ర‌శాంత్ కిషోర్ స్పందించారు. ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

Kodali Nani Shocking Comments on PL and Chandrababu Meet up

చంద్ర బాబు గ‌డువు పూర్త‌యి పోయిన ట్యాబ్లెట్ లాంటోడ‌ని ఎద్దేవా చేశారు. ఎంత మంది ప్ర‌శాంత్ కిషోర్ (పీకే)ల‌ను పెట్టుకున్నా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాహుబ‌లి లాంటోడంటూ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు రిటైర్మెంట్ ద‌శ‌లో ఉన్నాడ‌ని, ఆయ‌న చ‌రిష్మా ఇక్క‌డ ఏమీ ప‌ని చేయ‌ద‌న్నారు. ఎన్ని పార్టీలు క‌లిసి వ‌చ్చినా ద‌మ్మున్న జ‌గ‌న్ ను ఢీకొట్టే ద‌మ్ము ఎవ‌రికీ లేద‌న్నాడు కొడాలి నాని(Kodali Nani). ప్ర‌శాంత్ కిషోర్ ను క‌లిస్తే ఏమ‌వుతుంద‌ని ప్ర‌శ్నించారు.

రాజ‌కీయాల‌లో పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టులు క‌ల‌వ‌డం స‌హ‌జ‌మేన‌ని, ఏమైనా భూమి బ‌ద్ద‌ల‌వుతుందా అని ఎద్దేవా చేశారు. పీకేను పూర్తిగా తాము వాడేశామ‌ని, ఆయ‌న బుర్ర‌లో ఉన్న‌దంతా పూర్త‌యి పోయింద‌ని ఇక మిగిలింది గుజ్జు మాత్ర‌మేన‌ని అది ఇప్పుడు వ‌ర్క‌వుట్ కాద‌న్నారు కొడాలి నాని.

ప్ర‌శాంత్ కిషోర్ కు ఐ ప్యాక్ కు సంబంధం లేద‌న్నారు. ఇండియా కూట‌మిలో చేరాలంటూ మ‌మ‌తా బెనర్జీ పంపితే పీకే చంద్ర‌బాబు కోసం వ‌చ్చాడ‌ని తెలిపాడు.

Also Read : CM Revanth Reddy : 28 నుంచి తెలంగాణ‌లో గ్రామ స‌భ‌లు

Leave A Reply

Your Email Id will not be published!