Mansoor Ali Khan : నటుడు మన్సూర్ కు జరిమానా
రూ. లక్ష చెల్లించాలని ఆదేశం
Mansoor Ali Khan : తమిళనాడు – ప్రముఖ సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కు బిగ్ షాక్ తగిలింది. నటి త్రిషపై నోరు పారేసుకోవడంతో దేశ వ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. లియో మూవీ సందర్భంగా తనకు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని కామెంట్ చేయడం కలకలం రేపింది. దీంతో మహిళా కమిషన్ తో పాటు నటీమణులు ఖుష్భు, మీనా , తదితరులు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
Mansoor Ali Khan Comments Viral
ఇదిలా ఉండగా మన్సూర్ అలీ ఖాన్ చిరంజీవితో పాటు మరికొందరిపై తన పరువుకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంటూ మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు అక్షింతలు పెట్టింది. ఈ సందర్భంగా నోరు పారేసుకోవడం కోర్టుకు రావడం మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) కు అలవాటుగా మారిందంటూ జడ్జి పేర్కొన్నారు.
తాజాగా విచారణ చేపట్టిర కోర్టు భారీ జరిమానా విధించింది. నటుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరువు నష్టం దావా వేసినట్లు లేదని, ఇది కేవలం ప్రచారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందంటూ సీరియస్ కామెంట్స్ చేసింది. అతడి పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు పేర్కొంది. రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
Also Read : JD Laxminarayana : జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ