Minister KTR : వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డెలివ‌రీ సెంట‌ర్

స్ప‌ష్టం చేసిన మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – ఐటీ రంగానికి సంబంధించి ఇవాళ దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా తెలంగాణ మారింద‌న్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డిస్క‌వ‌రీ మీడియా సంస్థ‌కు సంబంధించిన హైద‌రాబాద్ డెలివ‌రీ సెంట‌ర్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు.

Minister KTR  Speech

త‌న జీవితంలో అత్యంత ఆనంద క‌ర‌మైన స‌న్నివేశంగా ఇది మిగిలి పోతుంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. వేగ‌వంత‌మైన అభివృద్దికి ఐటీ తెలంగాణ ఓ న‌మూనా అని పేర్కొన్నారు కేటీఆర్(Minister KTR ). ఈ ఏడాది మే నెల‌లో అమెరికాలో ప‌ర్య‌టించిన సంద‌ర్బంగా అలెక్స్ కార్ట‌ర్ తో స‌మావేశ‌మైన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు.

వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డిస్క‌వ‌రీ గ్లోబ‌ల్ కెపాబిలిటీ సెంట‌ర్ ను ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. ప్ర‌క‌టించిన నాలుగు నెల‌ల్లోనే హైద‌రాబాద‌ర్ డెలివ‌రీ సెంట‌ర్ ను ప్రారంభించ‌డం చెప్ప‌లేనంత సంతోషాన్ని ఇచ్చింద‌న్నారు కేటీఆర్. ఇదిలా ఉండ‌గా ఈ సెంట‌ర్ ను హైద‌రాబాద్ లోని ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్ పార్క్ లో ఏర్పాటు చేసింది.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అనేది టెలివిజన్, ఫిల్మ్ స్ట్రీమింగ్, పరిశ్రమలలో అనేక దిగ్గజ బ్రాండ్‌లతో ప‌ని చేస్తోంది. ఇది ప్రముఖ మీడియా, వినోద సంస్థ.

Also Read : Rajinikanth Thanks : బీసీసీఐకి ర‌జ‌నీకాంత్ థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!