Nara Lokesh Slams : ప్ర‌చారం ఎక్కువ ప‌ని త‌క్కువ‌

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్

Nara Lokesh Slams : అమ‌రావ‌తి – సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీ ప్ర‌భుత్వం మాట‌లు త‌ప్ప చేత‌లు లేవంటూ ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh). ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీల‌ను మ‌రిచి పోయారంటూ మండిప‌డ్డారు.

Nara Lokesh Slams AP CM YS Jagan

మాట‌లు కోట‌లు దాటాయ‌ని పేర్కొన్నారు. క‌డ‌ప జిల్లాలో మూడేళ్ల‌లో స్టిల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాన‌ని చెప్పార‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి పూర్తి చేసిన పాపాన పోలేదంటూ ధ్వ‌జ‌మెత్తారు నారా లోకేష్.

సొంత జిల్లాలో శిలా ఫ‌ల‌కం చేసి నేటికి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్త‌యింద‌న్నారు. రూ. 15 వేల కోట్ల‌తో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామ‌ని , 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ మాయ మాట‌లు చెప్పాడ‌ని, జ‌గ‌న్ ను ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేప‌ట్టాల్సి ఉంద‌ని క‌నీసం తుప్ప‌లు తొల‌గించేందుకు సైతం నిధులు కేటాయించ లేద‌ని ఆరోపించారు. మొద‌ట ఒప్పందం చేసుకున్న లిబ‌ర్టీ స్టీల్స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేధింపులు, బెదిరింపులు త‌ట్టుకోలేక ప‌రారైంద‌ని ఆరోపించారు.

జేఎస్ డ‌బ్ల్యూ అనే మ‌రో కంపెనీని బ‌తిమాలి ఏడాది కింద‌ట మ‌రో సారి శంకుస్థాప‌న చేశార‌ని , మ ఊడు నెలల్లో ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌స్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ప‌నులు అంగుళం కూడా ముందుకు సాగిన పాపాన పోలేద‌న్నారు నారా లోకేష్.

Also Read : Amit Shah : అన్ని స‌మ‌స్య‌ల‌కు గీత‌లో ప‌రిష్కారం

Leave A Reply

Your Email Id will not be published!