Palestine Pity : పాలస్తీనా అరణ్య రోదన
ఇజ్రాయెల్ దాడుల పరంపర
Palestine Pity : పాలస్తీనా – హమాస్ ఉగ్ర మూకుల మూకుమ్మడి రాకెట్ల దాడులతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ పాలస్తీనా పై కన్నెర్ర చేశాయి. ఒకరిపై మరొకరు దాడుల పరంపర కొనసాగుతోంది.
హమాస్ టెర్రరిస్టుల దాడులో సమాచారం అందిన మేరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేస్తున్నారు.
Palestine Pity Viral
ఇదే సమయంలో తమపై అనూహ్యంగా దాడికి పాల్పడిన హమాస్ టెర్రరిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఈ దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించ్చారు. యుద్ద నేరస్థులుగా పరిగణించడం జరుగుతుందన్నారు.
ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇవాళ టెక్నాలజీ సాయంతో రాకెట్లను ప్రయోగించామని, సంతోషానికి లోనవుతున్న హమాస్ టెర్రరిస్టుల భరతం పడతామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పాలస్తీనాకు(Palestine) చెందిన చిన్నారులను విచక్షణ కోల్పోయి చంపేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Muttireddy Yadagiri Reddy : ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి