PM Modi Tour : అక్టోబ‌ర్ 2న తెలంగాణ‌లో మోదీ టూర్

బ‌హిరంగ స‌భ‌ల‌లో పాల్గొన‌నున్న పీఎం

PM Modi Tour : తెలంగాణ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఈ విష‌యాన్ని రాష్ట్ర బీజేపీ కార్య‌వ‌ర్గం శ‌నివారం వెల్ల‌డించింది. ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలోని రెండు జిల్లాల‌లో పీఎం ప‌ర్య‌టిస్తార‌ని తెలిపింది.

బీజేపీ ఆధ్వ‌ర్యంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ , నిజామాబాద్ జిల్లాలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తుంద‌ని , ఇందులో భాగంగా వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 2న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi) పాల్గొంటార‌ని వెల్ల‌డించారు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి.

PM Modi Tour to Telangana

ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఎన్నిక‌ల జ్వ‌రం స్టార్ట్ అయ్యింది. అన్ని పార్టీలు త‌మ త‌మ వ్యూహాల‌తో ముందుకు వెళుతున్నారు. ఈసారి ఎలాగైనా స‌రే బీజేపీ జెండా ఎగుర వేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. ఈ మేర‌కు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ప‌లుమార్లు ప‌ర్య‌టించారు.

ఆయ‌న ప్ర‌ముఖ సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ తో పాటు పీవీ సింధును క‌లుసుకున్నారు. అమిత్ షా స్ట్రాట‌జీ ఏమిట‌నేది ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌ధానంగా టాప్ హీరోల‌ను లైన్ లో పెట్ట‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణలు మారుతున్నాయ‌ని సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

Also Read : Kurasala Kanna Babu : బాల‌య్య మెంట‌ల్ కేసు – క‌న్న‌బాబు

Leave A Reply

Your Email Id will not be published!