TS Digital Media : తెలంగాణ డిజిట‌ల్ మీడియాకు అవార్డు

డైరెక్ట‌ర్ దిలీప్ కు పుర‌స్కారం

TS Digital Media : హైద‌రాబాద్ – తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ గా ఉన్న కొణ‌తం దిలీప్ రెడ్డికి అరుదైన అవార్డు వ‌రించింది. ప‌బ్లిక్ రిలేష‌న్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) ఆధ్వ‌ర్యంలో సోష‌ల్ మీడియా ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు ను అందుకున్నారు. ఈ పుర‌స్కారంతో పాటు మ‌రో నాలుగు అవార్డులు కూడా తెలంగాణ ఐటీ విభాగం తెలంగాణ డిజిట‌ల్ మీడియాకు ద‌క్కాయి.

TS Digital Media Awards

ఇందులో సోష‌ల్ మ‌డియాలో ఉత్త‌మ వినియోగం కింద అవార్డు ద‌క్కింది. ఉత్త‌మ వార్షిక నివేదిక అవార్డును వ‌రించింది. తెలంగాణ(Telangana) ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-2023 సంవ‌త్స‌రానికి సంబంధించి ఎంపిక క‌మిటీ అత్యుత్త‌మ‌మైన‌దిగా పేర్కొంది.

అంతే కాకుండా ప్ర‌జా సేవ‌ల ప్ర‌క‌ట‌న‌ల అవార్డు కూడా తెలంగాణ డిజిట‌ల్ మీడియా విభాగానికి ద‌క్కింది. మ‌న ట్యాంక్ బండ్ ను శుభ్రంగా , అందంగా ఉంచుకుందాం అన్న వీడియో యాడ్ కు పుర‌స్కారం ద‌క్కింది.

ఉత్త‌మ ప్ర‌భుత్వ క‌మ్యూనికేష‌న్స్ ఫిల్మ్ కేట‌గిరీ కింద తెలంగాణ డిజిటల్ విభాగం త‌యారు చేసిన కాళేశ్వ‌రం తెలంగాణ జ‌ల విప్ల‌వం వీడియోకు పుర‌స్కారం ల‌భించింది. నాలుగు అవార్డులు పొందిన తెలంగాణ డిజిట‌ల్ మీడియా విభాగం త‌ర‌పున డైరెక్ట‌ర్ కొణతం దిలీప్ రెడ్డి న్యూఢిల్లీలో అందుకున్నారు.

Also Read : PM Modi Tour : అక్టోబ‌ర్ 2న తెలంగాణ‌లో మోదీ టూర్

Leave A Reply

Your Email Id will not be published!