Telangana Election Commission : బరిలో 2,290 మంది అభ్యర్థులు
మొత్తం 119 నియోజకవర్గాలు
Telangana Election Commission : హైదరాబాద్ – తెలంగాణలో(Telangana) ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. 3న గెజిట్ ప్రకటించింది. 10వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 13న స్క్రూటినీ పూర్తయింది. చివరకు నవంబర్ 15న అభ్యర్థుల ఉపసంహరణ పూర్తయింది. ఈ విషయాన్ని ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇవో వికాస్ రాజ్ వెల్లడించారు.
Telangana Election Commission Updates
రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు నిలిచారు చివరకు. అత్యధికంగా హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 48 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మధు యాష్కి గౌడ్ , బీఆర్ఎస్ తరపున సుధీర్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ కొనసాగుతోంది.
ఇక బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ బరిలో నిలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ , బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడం విశేషం. ఇక కామారెడ్డిలో 39 మంది ఉన్నారు. ఇక్కడ కూడా సీఎం కేసీఆర్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు.
ఇక మేడ్చల్ లో 39 మంది, నారాయణపేటలో 7, బాన్సువాడలో 7 మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు ఎన్నికల కమిషనర్.
Also Read : Eatala Rajender : దొరను దించితేనే తెలంగాణకు విముక్తి
