Special Holiday TS Govt : మ‌హిళ‌ల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

మార్చి 8న సెల‌వు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న

Special Holiday TS Govt : సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి తెలంగాణ ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. మార్చి 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

రాష్ట్రంలోని మ‌హిళా ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు ప్ర‌తి ఒక్క‌రికీ సెల‌వు(Special Holiday TS Govt)  ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ప్ర‌త్యేక సెల‌వు దినంగా ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇందులో భాగంగా కేసీఆర్ స‌ర్కార్ సెల‌వు మంజూరుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప్ర‌స్తుతం జారీ చేసిన ఉత్త‌ర్వుల మేర‌కు రాష్ట్రంలోని అన్ని శాఖ‌లు, విభాగాల‌లో ప‌ని చేస్తున్న మ‌హిళా ఉద్యోగులంద‌రికీ సెల‌వు వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. అంతే కాకుండా ప్రైవేట్ సంస్థ‌ల్లో ప‌ని చేసే మ‌హిళ‌ల‌కు కూడా తీపి వార్త చెప్పింది. స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్ కూడా ఇస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల‌లో స్ప‌ష్టం చేసింది. మ‌హిళా ఉద్యోగుల‌కు త‌ప్ప‌నిస‌రిగా సెల‌వు ఇవ్వాల‌ని తెలంగాణ స‌ర్కార్(Special Holiday TS Govt)  ఈ మేర‌కు ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 8న ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళా దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. మ‌రో వైపు మార్చి 7న దేశ వ్యాప్తంగా హోళీ రంగేళి పండుగ జ‌ర‌గ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సెల‌వు మంజూరు చేసింది.

ఇక తెలంగాణ స‌ర్కార్ కూడా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి 7తో పాటు 8న కూడా రెండు రోజులు సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల‌లో స్ప‌ష్టం చేసింది. దీంతో వ‌రుస సెల‌వుల‌తో మ‌హిళ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : సానియా మీర్జా దేశానికి గ‌ర్వ కార‌ణం

Leave A Reply

Your Email Id will not be published!