Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

శ్రీ‌వారి ఆదాయం రూ. 3.17 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. ఈనెల 23 నుంచి ఏకాద‌శి ప‌ర్వ‌దినం కావ‌డంతో భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ‌ల‌ను ద‌ర్శించు కునేందుకు బారులు తీరారు. చిన్నారులు, వృద్దులు ఇబ్బంది ప‌డ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది టీటీడీ.

Tirumala Rush with Devotees

ఇదిలా ఉండ‌గా రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) పాల‌క మండ‌లి .

ఇదిలా ఉండ‌గా నిన్న స్వామి, అమ్మ వార్ల‌ను 64 వేల 40 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 21 వేల 527 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.17 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం డైరెక్టు లైన్ లో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్లు లేకుండా ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 180 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

Also Read : DGP Ravi Gupta : డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం – డీజీపీ

Leave A Reply

Your Email Id will not be published!