Tejashwi Yadav : అబద్దాల కళలో మోదీ ఆరితేరారు – తేజస్వి
సంచలన కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన గురువారం ఓ జాతీయ మీడియా ఛానల్ తో ముచ్చటించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. అబద్దాలు చెప్పడంలో మోదీ ఆరి తేరారని, మోసాలు, కుట్ర పూరితమైన పన్నాగాలు చేయడంలో బీజేపీ మించి పోయిందని ఆరోపించారు తేజస్వి యాదవ్.
తమ పార్టీకి పాలించే సత్తా లేదని, దాని పనై పోయిందంటూ చెత్త కామెంట్స్ చేసిన బీజేపీ ఇప్పుడు చూసి ఏం చెబుతుందో చూడాలన్నారు.
మహా ఘట్ బంధన్ లేదా మహా కూటమిది నిజమైన ప్రభుత్వం. బీహార్ లో ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజలు గత కొంత కాలం నుంచీ కోరుకున్నది ఇదేనని స్పష్టం చేశారు.
నితీష్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్ ల బంధానికి ఇది నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం. ఆర్సీపీ సింగ్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ మరాఠా షిండే మోడల్ ను అమలు చేయాలని అనుకుందన్నారు.
కానీ నితీశ్ కుమార్ చాణక్యం , రాజకీయ అనుభవం ముందు అమిత్ షా పాచికలు పారలేదని ఎద్దేవా చేశారు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav). అత్యంత ధైర్యంతో బీజేపీని పక్కన పెట్టారన్నారు.
ప్రజల కోసం పని చేస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల అవసరం ఉండేది కాదన్నారు. ప్రజలు తమ పక్షాన ఉన్నారని, రాజ్యాంగాన్ని కాపాడు కోవడం తమ ధర్మమని పేర్కొన్నారు.
32 ఏళ్ల తేజస్వి యాదవ్ కొత్త ప్రభుత్వం నిరుద్యోగం, పేదరికం నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
Also Read : ఉప రాష్ట్రపతి కావాలన్నది ఓ జోక్ – నితీశ్