Lalan Singh PK : పీకే స్ట్రాట‌జిస్ట్ కాదు ప‌క్కా వ్యాపార‌వేత్త

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన జేడియూ

Lalan Singh PK : బీహార్ లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఆర్డేజీ, కాంగ్రెస్ పార్టీల‌తో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ చీఫ్ , సీఎం నితీశ్ కుమార్ ను టార్గెట్ చేశారు భార‌తీయ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.

మాజీ జేడీయూ నాయ‌కుడు ప‌వ‌న్ వ‌ర్మ ఓ అడుగు ముందుకేసి నితీశ్ కుమార్ , ప్ర‌శాంత్ కిషోర్ మ‌ధ్య రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ త‌రుణంలో త‌మ మ‌ధ్య ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

కొద్ది రోజుల త‌ర్వాత జేడీయూ ప్ర‌శాంత్ కిషోర్ ను టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. బీహార్ రాష్ట్ర రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ప్ర‌ధానంగా పీకేపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది జేడీయూ.

ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త కానే కాడ‌ని ఆయ‌న ప‌క్కా వ్యాపార‌వేత్త అంటూ నిప్పులు చెరిగింది పార్టీ. ఇదిలా ఉండ‌గా ప్ర‌శాంత్ కిషోర్ 2015 నుండి 2020 దాకా నితీశ్ కుమార్ తో క‌లిసి ప‌ని చేశాడు.

పీకే తిరిగి జేడీయూలో చేరే ప్ర‌తిపాద‌న చేస్తున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టారు జేడీయూ జాతీయ చీఫ్ రాజీవ్ రంజ‌న్ సింగ్ అలియాస్ లాల‌న్(Lalan Singh) .

ప్ర‌శాంత్ కిషోర్ ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నాడో దేశ ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని పేర్కొన్నాడు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన వ్య‌క్తి. బీహార్ లో ఆ పార్టీకి మేలు చేకూర్చేందుకు మ‌ళ్లీ మాతో జ‌త క‌ట్టాల‌ని య‌త్నిస్తున్నాడంటూ లాల‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

ఒక ర‌కంగా దేశంలో ప్ర‌తిపక్షాలు లేకుండా చేయాల‌ని పీకే కుట్ర ప‌న్నుతున్నాడంటూ మండిప‌డ్డారు.

Also Read : పార్టీ ప‌గ్గాలు రాహుల్ గాంధీకి ఇవ్వాలి

Leave A Reply

Your Email Id will not be published!