Samantha : అదంతా అబ‌ద్దం క‌న్నీటి ప‌ర్యంతం

నేను ఇంకా బ‌తికే ఉన్నాన‌న్న స‌మంత‌

Samantha : ఊ అంటావా అంటూ దేశాన్ని ఒక ఊపు ఊపిన న‌టి స‌మంత క‌న్నీంటి ప‌ర్యంత‌మైంది. ఆమె అంతు చిక్క‌ని వ్ఆయ‌ధి మ‌యోసైటిస్ తో బాధ ప‌డుతోంది. ఇదే విష‌యాన్ని తానే స్వ‌యంగా వెల్ల‌డించింది. అయితే త‌న ప‌రిస్థితి దారుణంగా ఉందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించింది. ఇదంతా పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని చెప్పింది. తాను న‌టించిన య‌శోద మూవీ ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా మీడియాతో త‌న అనుభ‌వాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకుంది స‌మంత‌(Samantha).

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మాట్లాడుతుండ‌గానే క‌న్నీళ్లు పెట్టుకుంది. త‌న‌పై పెద్ద ఎత్తున రూమ‌ర్లు కొన‌సాగుతున్నాయి. త‌న‌కు వ‌చ్చిన మ‌యోసైటిస్ అనే వ్యాధి భ‌యంక‌ర‌మైన‌ది ఏమీ కాద‌ని , దీనికి గురైన చాలా మంది కోలుకున్నార‌ని చెప్పింది. తాను కూడా దానిని అధిగ‌మిస్తాన‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు స‌మంత‌. త్వ‌ర‌లోనే తాను బ‌య‌ట ప‌డ‌తాన‌ని చెప్పింది.

తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ట్లు కావాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్త‌వం. భ‌యంక‌ర‌మైన టీబీ, కోవిడ్, క్యాన్స‌ర్, ప‌చ్చ కామెర్లు ఇలాంటి ఎన్నో వ్యాధుల‌కు మందులు ఉన్నాయ‌ని వాటికి గురైన వారంతా కోలుకున్నార‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. త‌న‌కు కూడా సంక్ర‌మించిన మ‌యోసైటిస్ వ్యాధి పెద్ద రోగమేమీ కాద‌ని స్ప‌ష్టం చేశారు న‌టి స‌మంత‌(Samantha).

అయితే తాను ఆ ప‌రిస్థితిలో లేన‌ని, బాగానే ఉన్నాన‌ని చెప్పింది. ఇప్పుడైతే తాను ఇంకా చావ లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది స‌మంత‌. అయితే ప్ర‌స్తుతం క‌ఠిన ప‌రిస్థితుల్లోనే ఉన్నాన‌ని వెల్ల‌డించింది.

Also Read : ఆ ద‌ర్శ‌కుడి మాట‌లే నాకు ఓదార్పు

Leave A Reply

Your Email Id will not be published!