CM KCR : హ‌ర‌గోపాల్ పై రాజ‌ద్రోహం కేసు ఎత్తేయండి

ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR : సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ పై పోలీసులు న‌మోదు చేసిన ఉపా (రాజ‌ద్రోహం) కేసును ఎత్తి వేయాల‌ని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ప్రజ‌ల మ‌ధ్య ఉంటూ తెలంగాణ ఉద్య‌మానికి వెన్ను ద‌న్నుగా నిలిచిన హ‌ర‌గోపాల్ ప‌ట్ల కేసు న‌మోదు చేయ‌డం దారుణ‌మ‌ని ప‌లువురు పేర్కొన్నారు.

రాష్ట్రంలో న‌క్స‌లైట్లు లేర‌ని డీజీపీ ప్ర‌క‌టించార‌ని, మ‌రి తాను ఎక్క‌డ‌, ఎవ‌రితో ఎప్పుడు మాట్లాడానో డీజీపీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎవ‌రో ఏదో చెబితే ఉపా కింద త‌న‌పై ఎలా కేసు న‌మోదు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు తెలిసి సీఎంకు లేదా ఇత‌రుల‌కు తెలియ‌కుండానే దీనిని అడ్డం పెట్టుకుని కేసు న‌మోదు చేసిన‌ట్లు భావిస్తున్న‌ట్లు తెలిపారు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ .

ఇదిలా ఉండ‌గా కేసు న‌మోదు విష‌యంపై తీవ్ర రాద్దాంతం జ‌ర‌గ‌డంతో సీఎం కేసీఆర్(CM KCR) స్వ‌యంగా రంగంలోకి దిగారు. దీనిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ తో పాటు ఇత‌రుల‌పై న‌మోదు చేసిన ఉపా (రాజ‌ద్రోహం) కేసుల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డీజీపీని ఆదేశించారు. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు తెలంగాణ డీజీపీ.

ఇదిలా ఉండ‌గా పోలీసులు అత్యుత్సాహంతో త‌న‌పై కావాల‌ని రాజ‌ద్రోహం పేరుతో కేసు నమోదు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఎక్క‌డ రాజ‌ద్రోహానికి కుట్ర ప‌న్నానో డీజీపీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కాగా 2002 ఆగ‌స్టు 10న ములుగు తాడ్వాయి ఠాణాలో హ‌ర గోపాల్ పై కేసు న‌మోదైంది.

Also Read : Avinash Reddy CBI : సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!