Daggubati Purandeswari : టీటీడీ రాజకీయ పునరావాసం కాదు
నిప్పులు చెరిగిన పురందేశ్వరి
Daggubati Purandeswari : ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర సర్కార్ పై, ప్రత్యేకించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది అత్యంత పవిత్రమైన స్థలమని పేర్కొన్నారు. కేవలం దానిని జగన్ వచ్చాక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ట్విట్టర్ వేదికగా మంగళవారం టీటీడీ చైర్మన్ నియామకంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Daggubati Purandeswari Serious Words
హిందూ ధర్మంపై నమ్మకం కలిగిన వారినే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా, పాలక మండలి సభ్యులుగా నియమించాలని స్పష్టం చేశారు. కానీ జగన్ ఆ నియమాలను పాటించడం లేదని ఆరోపించారు. తుంగలో తొక్కారంటూ ధ్వజమెత్తారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). కేవలం హిందూ ధర్మంపై నమ్మకం కలిగిన వాళ్లే ఆ పదవికి న్యాయం చేయగలరని పేర్కొన్నారు.
ఇంతకు ముందు ఏపీ జగన్ సర్కార్ ఏకంగా 80 మందితో టీటీడీ పాలక మండలిలో జంబో సభ్యులను నియమించిందని ధ్వజమెత్తారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వెనక్కి తగ్గారని ప్రస్తుతం 52 మందితో కొనసాగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇకనైనా జగన్ ఆలోచించాలని సూచించారు. ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు.
Also Read : CM KCR Announce : రేషన్ డీలర్లకు సీఎం ఖుష్ కబర్