Vijay Sai Reddy : దొంగ ఓట్లకు కేరాఫ్ చంద్రబాబు
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి
Vijay Sai Reddy : టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. దొంగ ఓట్లకు కేరాఫ్ బాబేనని మండిపడ్డారు. దొంగ ఓట్ల ఒలింపిక్ హీరో అని ఎద్దేవా చేశారు. వన్ సిటిజన్ వన్ ఓటు అనేది తమ పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. దొంగ ఓట్ల నమోదుకు శ్రీకారం చుట్టింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు ఎంపీ.
Vijay Sai Reddy Shocking Comments
ఆనాడు సేవా మిత్ర పేరుతో ఇవాళ మై టీడీపీ యాప్ ల పేరుతో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారని ఆరోపించారు విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). ఓట్ల గల్లంతు, దొంగ ఓట్లు చేర్చే ప్రక్రియకు నాంది పలికింది చంద్రబాబేనని ఆరోపించారు. ఓటరు కులం ఏమిటిని అడుగుతున్న కుల ఉన్మది చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు.
ఓటరు పొలిటికల్ ఫ్రిఫరెన్స్ ఏంటని అడిగే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఓటరు ప్రొఫైల్ సర్వే పేరుతో అభ్యంతరకర ప్రశ్నలపై సీఈసీకి ఫిర్యాదు ఇచ్చామని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి.
ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ సారథ్యంలో ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఈసీ సానుకూలంగా స్పందించారని తెలిపారు విజయ సాయి రెడ్డి.
Also Read : CM KCR : సాంస్కృతిక సారథి ఉద్యోగులకు గుడ్ న్యూస్