TTD Board Members : టీటీడీ సభ్యుల నియామకంపై పిటిషన్
హైకోర్టులో చింతా వెంకటేశ్వర్లు పిల్
TTD Board Members : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టీటీడీని రాజకీయ పునరావాసానికి కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
TTD Board Members ED Case Issue
తాజాగా తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. నేర చరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు ఉన్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, కేతన్ దేశాయ్ , శరత్ చంద్రా రెడ్డిలను నియమించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ముగ్గురిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
టీటీడీ సభ్యులగా వెంటనే తొలగించాలని పిటిషన్ లో పేర్కొన్నారు చింతా వెంకటేశ్వర్లు. ఈ నియామకాల విషయంలో నియమ నిబంధనలను తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎంపిక విషయం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read : Vijay Sai Reddy : దొంగ ఓట్లకు కేరాఫ్ చంద్రబాబు