Nara Lokesh : మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వ‌ని ఏపీ స‌ర్కార్

రాయితీలు ఇక ఎలా వ‌స్తాయ‌న్న లోకేష్

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా ఆయ‌న రైతుల‌తో మాట్లాడారు. మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్ల‌నే రాయితీలు ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Nara Lokesh Comments on YS Jagan

జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కావాల‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌న్నారు. రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసింద‌ని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక పామాయిల్ మొక్క‌లు ఉచితంగా అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.

సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టిస్తూ పాల‌న సాగిస్తున్నారంటూ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై మండిప‌డ్డారు. త‌మ పాల‌న‌లో ప్రాజెక్టులు, ఎత్తి పోత‌ల ప‌థ‌కాల‌కు నిధులు మంజూరు చేశామ‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వాటిపై ఫోక‌స్ పెట్టిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

మ‌రో వైపు ప‌నులు చేప‌ట్టిన కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు మంజూరు చేయ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు నారా లోకేష్(Nara Lokesh). రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, ఇక జ‌నం భ‌రించే స్థితిలో లేర‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో మార్పు త‌థ్య‌మ‌ని , తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

శాండ్, ల్యాండ్ మాఫియాలు రెచ్చి పోతున్నాయ‌ని ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే దాడులు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప‌వ‌ర్ శాశ్వ‌తం కాద‌న్న‌ది గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

Also Read : TTD Board Members : టీటీడీ స‌భ్యుల నియామ‌కంపై పిటిష‌న్

Leave A Reply

Your Email Id will not be published!