Supriya Shrinate : బ‌డా బాబుల‌కు మోదీ స‌పోర్ట్

కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీ‌నాటే

Supriya Shrinate : హైద‌రాబాద్ – ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మ‌న్ సుప్రియా శ్రీ‌నాటే నిప్పులు చెరిగారు. బుధ‌వారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేశారంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Supriya Shrinate Serious Comments on Modi

ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగి పోతుంటే మోదీ చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నారంటూ మండిప‌డ్డారు. వెనుక‌బ‌డిన ప్ర‌జ‌ల హ‌క్కుల అంశం తెర పైకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌ధాని మోదీ స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి మ‌ళ్లించ‌డం షురూ చేశారంటూ ఆరోపించారు.

దేశంలో కొలువుతీరిన మోదీ 10 ఏళ్ల కాలంలో ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. సొల్లు క‌బుర్లు చెప్ప‌డం త‌ప్ప ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు సుప్రియో శ్రీ‌నాటే(Supriya Shrinate). బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకున్నారంటూ ఆరోపించారు.

అన్ని వ‌న‌రుల‌ను అప్ప‌నంగా బ‌డా బాబుల‌కు క‌ట్టబెడుతూ ఇప్పుడు అభివృద్ది జ‌పం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు ఏఐసీసీ సోష‌ల్ మీడియా చైర్మ‌న్. దేశంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని ఇది స్ప‌ష్టంగా అర్థ‌మ‌య్యే రోజు త్వ‌ర‌లోనే రానుంద‌న్నారు. జ‌నం ఇండియా కూట‌మిని గెలిపించేందుకు రెడీగా ఉన్నారంటూ తెలిపారు.

Also Read : TTD Donation : ఎస్వీబీసీ ట్ర‌స్టుకు భ‌క్తుల విరాళం

Leave A Reply

Your Email Id will not be published!