Bhatti Vikramarka : సంప‌దను సృష్టిస్తాం పంపిణీ చేస్తాం

డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka : ఖ‌మ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం స‌హ‌చ‌ర మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుల‌తో క‌లిసి ఖ‌మ్మం జిల్లాలో విజ‌యోత్స‌వ ర్యాలీ చేప‌ట్టారు. వేలాది మంది త‌ర‌లి వ‌చ్చారు.

Bhatti Vikramarka Comment

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌(Bhatti Vikramarka). ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 10 స్థానాల‌కు గాను 9 స్థానాలు క‌ట్ట‌బెట్టార‌ని , ఈ జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు. బీఆర్ఎస్ రాక్షస పాల‌న‌ను సాగ‌నంపార‌ని, ఇందులో జ‌న‌మే కీల‌క పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు.

భారీ మెజారిటీని క‌ట్ట‌బెట్టినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప‌రంగా త‌యారు చేసిన మేనిఫెస్టోలో ఉన్న ప్ర‌తి ప‌థ‌కాన్ని అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే 100 రోజుల్లో 6 గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌న్నారు. సంప‌ద‌ను సృష్టిస్తామ‌ని, ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేస్తామ‌ని చెప్పారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

గ‌త ప్ర‌భుత్వంలో కంటే మ‌రింత అద్భుతంగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగాన్ని అభివృద్ది చేస్తామ‌ని పేర్కొన్నారు.

Also Read : Mayawati Declare : నా వార‌సుడు ఆకాష్ ఆనంద్

Leave A Reply

Your Email Id will not be published!