Bandla Ganesh : ప‌వ‌ర్ లేనోళ్ల‌కు ప్రెజెంటేష‌న్స్ ఎందుకు

నిప్పులు చెరిగిన సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్

Bandla Ganesh : హైద‌రాబాద్ – సినీ నిర్మాత‌, న‌టుడు , కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు బండ్ల గ‌ణేష్(Bandla Ganesh) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిత్యం వివాదాస్ప‌ద కామెంట్స్ తో ఏదో ర‌కంగా వార్త‌ల్లో నిలిచే ఆయ‌న ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప‌వ‌ర్ కోల్పోయిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీని, ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌ను టార్గెట్ చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌దే ప‌దే త‌మ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని జోష్యం చెప్పారు.

Bandla Ganesh Comment

అంతే కాదు త‌మ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి ప‌క్కాగా సీఎం కాబోతున్నాడంటూ ప్ర‌క‌టించారు. ఛాలెంజ్ కూడా విసిరారు. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే రెండూ జ‌రిగాయి. పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. త‌న‌కు స్నేహితుడైన రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ స‌ర్కార్ అసెంబ్లీ సాక్షిగా గ‌త ప్ర‌భుత్వం చేసిన దోపిడీ, అక్ర‌మాల గురించి శ్వేత ప‌త్రం విడుద‌ల చేసింది. దీనికి విరుద్దంగా బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు స్వేద ప‌త్రం పేరుతో ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించారు బండ్ల గ‌ణేష్. ప‌వ‌ర్ లేనోళ్ల‌కు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్స్ ఎందుకు అంటూ ప్ర‌శ్నించారు. గులాబీ నేత‌ల‌పై పంచ్ లు విసిరారు.

Also Read : Telangana Ministers : ఉమ్మ‌డి జిల్లాల‌కు ఇన్‌ఛార్జ్ మంత్రులు

Leave A Reply

Your Email Id will not be published!