అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష

చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సింఘాల్ ఆదేశం

తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతి కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగా నది ఒడ్డున ఉన్న కాశీ, ఉజ్జయిన్‌తో పాటు ఇతర ప్రాంతాలలో నిర్వహిస్తున్న పవిత్ర హారతి కార్యక్రమాలపై అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతి, గంటల నాదాల మధ్య నిర్వహించే పవిత్ర హారతి భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని అన్నారు. కాబట్టి కమిటీ లోతైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

వివిధ రాష్ట్రాల రాజధానులలో శ్రీ వేంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసినట్లు ఈవో తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గౌహతి మరియు బెల్గాం ప్రాంతాలలో భూమి కేటాయింపున‌కు సంబంధించి సంబంధిత అధికారులతో చర్చలు జరపాలని అన్నారు.

వేద పారాయణదారులు , పోటు కార్మికులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఈ నెలాఖరులోగా తగిన ఏర్పాట్లు చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టీటీడీ పరిధిలోని 59 స్థానిక మరియు అనుబంధ ఆలయాలలో 1,004 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, వాటిలో 794 కెమెరాలు ఇప్పటికే పని చేస్తున్నాయని ఈవో తెలిపారు. మిగిలిన ప్రదేశాలలో కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!