తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవలే లడ్డూ కల్లీ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. మరో వైపు కల్తీ చోటు చేసుకుందంటూ సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం బహిరంగంగానే ప్రకటించారు. ఆపై ప్రత్యేక దర్యాప్తు ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సిట్ సంచలన విషయాలు వెల్లడించింది.
ఈ మేరకు తనకు అందిన నివేదికను తీసుకున్న వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడును సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చరిత్రలోనే రెండు సార్లు ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో)గా నియమించ బడ్డారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్. ఆయన వచ్చీ రావడంతోనే టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ వెంటనే నివేదిక ఆధారంగా వెంటనే ఆనాటి అకౌంట్స్ ఆఫీసర్ బాలీజీని , ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రను ఈవోగా నియమించారు సీఎం. ఇవాళ రవిచంద్ర టీటీడీ చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
