చెన్నై : చెన్నై వేదికగా గురువారం జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు సమిష్టిగా రాణించింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో 72 పరుగుల తేడాతో ప్రత్యర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరుకునేందుకు వీలవుతుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 256 పరుగులు చేసింది. పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో ఇది అరుదైన రికార్డ్ టీమిండియా తరపున.
సంజూ శాంసన్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శర్మ రెచ్చి పోయాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ ఎప్పటి లాగే దుమ్ము రేపాడు. తను 38 రన్స్ చేశాడు. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ 44 రన్స్ తో ఆకట్టుకున్నారు. చివరగా వచ్చిన హార్దిక్ పాండ్యా రెచ్చి పోయాడు. తను 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు స్కోర్ ను ఛేదించలేక బౌలర్ల ధాటికి తట్టుకోలేక చతికిల పడింది. అయితే ప్రత్యర్థి జట్టును 100 రన్స్ లోపే ఆల్ అవుట్ చేస్తుందని అనుకుంటే కేవలం 72 పరుగుల తేడాతో ఓడించింది. మొత్తంగా భారత్ సెమీస్ ఆశలు ఈ విజయంతో నిలుపుకుంది.
