మహారాష్ట్ర : మనుషుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని బాబాలు, జ్యోతిష్కులు, సంఖ్యా శాస్త్రవేత్తలు రెచ్చి పోతున్నారు. అందినంత మేర దండుకుంటున్నారు. ప్రధానంగా చాలా మంది ఎక్కువ శాతం మహిళలను లోబర్చు కోవడం, లైంగికంగా వేధింపులకు పాల్పడడం, బ్లాక్ మెయిల్ చేయడం, సీసీ కెమెరాల సాయంతో , రికార్డు చేయడం, వాటిని బయటకు చేరవేస్తామంటూ బెదిరించడం చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో జ్యోతిష్కుడి బండారం బయట పడింది. అతను ఎవరో కాదు గతంలో నేవీలో కీలకమైన అధికారిగా పని చేశాడు. రిటైర్ అయ్యాక జ్యోతిష్కుడి అవతారం ఎత్తాడు. తనను తాను అపర దేవుడినంటూ ప్రకటించుకున్నాడు.
ఓ మహిళ తాను మోసపోయినట్లు గుర్తించింది. ఆ వెంటనే స్వయం ప్రకటిత జ్యోతిష్యుడైన అశోక్ ఖరత్ పై పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నాసిక్లో అరెస్టు చేశారు అశోక్ ఖారత్ ను. వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తానని వాగ్దానం చేసి అతను మహిళలను ప్రలోభపెట్టాడు. తాంత్రిక కర్మల పేరుతో తనపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డాడని 35 ఏళ్ల మహిళ ఒకరు అతనిపై ఆరోపించారు. బాధితులను నియంత్రించి, దోపిడీ చేయడానికి అతను మత్తు పదార్థాలు, భయాన్ని ఉపయోగించాడని పోలీసులు చెబుతున్నారు . ఈ కేసు ఒక బాధితురాలికి మాత్రమే పరిమితం కాలేదు. 58 మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నారు. అతను నాసిక్లోని కెనడా కార్నర్లో ఉన్న ఒక కార్యాలయం నుంచి తన కార్యకలాపాలు నిర్వహించాడు.
ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
