శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్ , లడఖ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తికి లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం చర్చనీయాంశంగా మారింది. శ్రీనగర్లోని సరస్సు తీరంలో ఉన్న ‘షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స లో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం శ్రీనగర్లో ఉన్న లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటికి జమ్మూ-కశ్మీర్ , లడఖ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం గత సంప్రదాయాలకు భిన్నంగా జరగడం విశేషం ఇది ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల న్యాయ నిర్వహణలో ఒక చారిత్రక ఘట్టానికి దర్పణంగా నిలిచింది. ఆగస్టు 2019లో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు బదులుగా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే మొదటిసారి. సాధారణంగా కొత్తగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షత వహిస్తుంటారు.
అయితే, సిన్హా ప్రస్తుతం విదేశాలలో ఉండటం, లడఖ్ న్యాయ వ్యవస్థలో ఇటీవల జరిగిన నిర్మాణాత్మక మార్పుల దృష్ట్యా ఈ బాధ్యతను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు అప్పగించారు. రాజస్థాన్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ భాటిని,జమ్మూ-కశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 5న నియమించారు; ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. జూన్ 2 నుండి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సంజీవ్ కుమార్ స్థానంలో జస్టిస్ భాటి నియమితులయ్యారు. 2016 నవంబర్ 16న రాజస్థాన్ హైకోర్టు బెంచ్కు పదోన్నతి పొందినప్పటి నుండి ఆయనకున్న విస్తృతమైన న్యాయ అనుభవాన్ని, సేవను గుర్తించి, ఆగస్టు 31న సుప్రీం కోర్టు కొలీజియం జస్టిస్ భాటి పదోన్నతిని సిఫార్సు చేసింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించాలనే నిర్ణయం ఒక ప్రధాన సంస్థాగత పరిణామం నేపథ్యంలో వచ్చింది .
