జపాన్ : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. జపాన్ పెట్టుబడిదారుల సంకోచాన్ని తొలగించేందుకు టోక్యో వెళ్లారు. ప్రధానంగగా జపాన్ పెట్టుబడిదారుల దృష్టిలో భారత్ పట్ల తక్కువ ఆసక్తి లేదా తక్కువ ప్రాధాన్యత ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. 1980లలో ఇందిరా గాంధీ ప్రఖ్యాత ‘చిన్న కారు’ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టేలా ఒసాము సుజుకీని ఒప్పించడంతో ఇది మొదలైంది. తమకు సులభంగా అందుబాటులో ఉండే పొరుగు ప్రాంతాలను వదిలి సవాలుతో కూడుకున్నదిగా భావించే భారత్ వైపు జపాన్ వ్యాపార రంగాన్ని ఆకర్షించడానికి ప్రయత్నించిన మొదటి భారతీయ మంత్రి గోయల్ కాదు. గతంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ చివరకు నరేంద్ర మోదీ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. గత వారం టోక్యోలో అడుగు పెట్టినప్పుడు భారత్ నుండి వెళ్ళిన అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం పట్ల సంతోషంగా ఉందన్నారు గోయల్.
ఈ సందర్బంగా భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా వీటన్నింటికీ అదనంగా ఒక గోల్ఫ్ కోర్స్ను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన జోడించారు. ఒక దశాబ్దం క్రితం ఢిల్లీలోని క్లిష్టమైన అధికారిక ప్రక్రియలు , అనుమతుల సమస్యలను అధిగమించడంలో జపాన్ వ్యాపార సంస్థలకు సహాయపడే బాధ్యతతో జపనీస్ భాష తెలిసిన ఒక వ్యక్తిని ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించారు కూడా. దాదాపు అర శతాబ్ద కాలంగా, చైనాలో పెట్టిన పెట్టుబడుల కంటే భారత్లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టేలా జపాన్ను ఒప్పించడానికి భారత ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. భారత్లో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే జపాన్ కంపెనీలు చైనాలో మొత్తం 130 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. కేవలం 2025లోనే చైనాలో జపాన్ పెట్టుబడులు 55 శాతానికి పైగా పెరగగా, భారత్లో ఆ పెరుగుదల 10 శాతం కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంది.
