Jaya Kishori Gadkari : గ‌డ్క‌రీతో జ‌యా కిషోరీ భేటీ

ఆధ్యాత్మిక ప్ర‌యాణంపై చ‌ర్చ‌

Jaya Kishori Gadkari : భార‌త దేశంలో అత్యంత ప్ర‌భావంత‌మైన వ‌క్త‌గా , ఆధ్యాత్మిక నాయ‌కురాలిగా , ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేస్తున్న జ‌యా కిషోరి బుధ‌వారం మ‌ర్యాద పూర్వకంగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లుసుకున్నారు. మ‌హారాష్ట్ర లోని నాగ్ పూర్ లోని త‌న నివాసంలో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు వీరిద్ద‌రూ.

ఇక జ‌యా కిషోరికి(Jaya Kishori) పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం స్పూర్తి దాయ‌క‌మైన ప్రసంగాలు, క‌థ‌ల‌తో అల‌రిస్తుంటారు. ఆమెకు ల‌క్ష‌లాది మంది అబిమానులు ఉన్నారు. అంతే కాదు ఆమెకు సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్ర‌త్యేకించి శ్రీ‌కృష్ణుడి భ‌గ‌వ‌ద్గీత గురించి పిల్ల‌ల‌కు సైతం అర్థం అయ్యేలా చెపుతారు. మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ గా రాణించారు.

ఈ మ‌ధ్య‌న జ‌యా కిషోరి గురించి ఎక్కువ‌గా జ‌నం సెర్చింగ్ చేయ‌డం కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆమె భ‌క్తిని ప్ర‌మోట్ చేస్తున్నారు. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తిన‌కుండా త‌న‌దైన శైలిలో అల్ప‌మైన ప‌దాల‌తో చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కూడా జ‌యా కిషోరీని బాగా ఇష్ట ప‌డ‌తారు. ఆమె చెప్పే స్పూర్తి దాయ‌క‌మైన క‌థ‌ల్ని,ప్ర‌సంగాల‌ను వింటారు. యోగాకు సంబంధించి కూడా వివ‌ర‌ణాత్మ‌కంగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు జ‌యా కిషోరీ.

Also Read : Kishan Reddy : ప‌ద‌వుల కోసం పాకులాడ లేదు

Leave A Reply

Your Email Id will not be published!