హైదరాబాద్ : భారతీయ సినీ చరిత్రలో అత్యంత జనాదరణ పొందిన ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న. రూ. 1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఇందులో కీలక పాత్ర పోషించిన హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ మధ్యన చిట్ చాట్ సందర్బంగా పేర్కొంది. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. సెన్సేషన్ గా మారాయి. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన వారణాసికి సంబంధించి ఇటీవలే కీలక అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. వచ్చే ఏడాది 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వారణాసి షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ కొనసాగుతోంది.
వారణాసి చిత్రం అంటార్కిటికాలో చిత్రీకరణ జరుపుకున్న ఏకైక చిత్రంగా చరిత్ర సృష్టించింది . ఈ మూవీ రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూలమైన , కఠినమైన నిబంధనలు గల చిత్రీకరణ ప్రదేశాలలో ఒకటిగా ఉంది అంటార్కిటికా. వీటన్నింటిని తట్టుకుని ప్రిన్స్ మహేష్ బాబు పై కీలక సన్నివేశాలను ప్లాన్ చేసి, చిత్రీకరించి ఒక అరుదైన ప్రపంచ ఘనతను సాధించింది. ఈ ప్రాజెక్ట్ వేగంగా పురోగమిస్తోంది. తీవ్రమైన చలి, ఊహించలేని వాతావరణ పరిస్థితులు, కఠినమైన పర్యావరణ నిబంధనలను ఎదుర్కొంటోంది. స్వచ్ఛమైన తెల్లని ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో సినిమాలోని కీలక భాగాలను చిత్రీకరించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
