Priyanka Gandhi : రేపే ప్రియాంక గాంధీ రాక

ఆసిఫాబాద్..ఖానాపూర్ స‌భ‌ల్లో

Priyanka Gandhi : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల తేదీ దగ్గ‌ర ప‌డుతోంది. దీంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై జ‌నం ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు బ‌రిలో ఉన్నా ప్ర‌ధానంగా ద్విముఖ పోరు కొన‌సాగుతోంది. గ‌త కొంత కాలంగా హ‌స్తం పార్టీ ఊహించని రీతిలో దూసుకు వ‌చ్చింది. దీంతో బీఆర్ఎస్ స‌ర్కార్ కు ఊపిరి స‌ల‌ప‌కుండా చేస్తోంది.

Priyanka Gandhi will come Hyderabad

ఇందులో భాగంగా న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వ‌స్తాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే మేని ఫెస్టోను అనౌన్స్ చేసింది. దానికి అభ‌య హ‌స్తం అని పేరు పెట్టింది. ఏకంగా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి షెడ్యూల్ ను కూడా ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ విస్తుతంగా రోడ్ షోస్ , కార్న‌ర్ మీటింగ్ లు, బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తున్నారు.

ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు కేసీఆర్ పాల‌న‌పై. తాము వ‌చ్చాక ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఉండ‌ద‌న్నారు. ఇది కేవ‌లం ప్ర‌జా ద‌ర్బార్ కు ప‌ని చేస్తుంద‌న్నారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉండ‌గా ఈనెల 19న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) తెలంగాణ‌కు రానున్నారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ తో పాటు ఖానాపూర్ ల‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించ‌నున్నారు. ఈ విష‌యాన్ని టీపీసీసీ వెల్ల‌డించింది.

Also Read : Vijaya Shanti : కేసీఆర్ నాటిన మొక్క ఈట‌ల

Leave A Reply

Your Email Id will not be published!