Minister KTR : తెలంగాణ న‌జ‌రానా అభివృద్దికి న‌మూనా

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – దేశంలోనే ఇప్పుడు పురోగ‌తి సాధిస్తున్న న‌గ‌రాల‌లో నెంబ‌ర్ వ‌న్ హైద‌రాబాద్ అని అన్నారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). శ‌నివారం బిజినెస్ నెట్ వ‌ర్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ (బీఎన్ఐ) ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స‌మావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి.

Minister KTR Comment

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపార‌, వాణిజ్య‌, ఐటీ, ఫార్మా , టెలికాం , లాజిస్టిక్ రంగాల‌లో మ‌న న‌గ‌రం ఆద‌ర్శ ప్రాయంగా ఉంద‌న్నారు. ఇలా కావ‌డానికి ఔత్సాహికులైన పారిశ్రామిక‌వేత్త‌లే కార‌ణ‌మ‌న్నారు కేటీఆర్.

ఆద‌ర్శ వంత‌మైన నాయ‌కుడు సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల‌లో ముందంజ‌లో కొన‌సాగుతోంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు మ‌న జీడీపీ త‌క్కువగా ఉండేద‌న్నారు. కానీ ఇవాళ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల కార‌ణంగా ఇప్పుడు ఐటీలో టాప్ గా కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అంటే అభివృద్ధికి న‌మూనాగా మార‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ఐటీతో అనుసంధానం చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని పేర్కొన్నారు కేటీఆర్.

Also Read : Priyanka Gandhi : రేపే ప్రియాంక గాంధీ రాక

Leave A Reply

Your Email Id will not be published!