Joinings in YSRCP: టీడీపీ-జనసేన కూటమికి షాక్ ! వైసీపీలోకి చేగొండి, సతీష్ రెడ్డి !

టీడీపీ-జనసేన కూటమికి షాక్ ! వైసీపీలోకి చేగొండి, సతీష్ రెడ్డి !

Joinings in YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేన పిఏసీ సభ్యులు, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరి రామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్… జనసేన పార్టీను వీడి వైసీపీలో చేరారు. అలాగే పులివెందుల టీడీపీ ముఖ్యనేత మాజీ సతీష్ రెడ్డి కూడా వైసీపీ(YSRCP) తీర్ధం పుచ్చుకున్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరు… సీఎం జగన్ సమక్షంలో వీరు వైసీపీ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఇటీవల తాడేపల్లిగూడేం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరి రామజోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. ఒకవైపు హరి రామజోగయ్య లేటర్లు రాస్తుండగానే అతని కుమారుడు సూర్య ప్రకాష్ వైసీపీలో చేరడం ఆశక్తికరంగా మారింది.

Joinings in YSRCP Viral

ఈ సందర్భంగా చేగొండి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ… ‘‘జనసేనలో నేను పని చేసిన ఈ ఆరేళ్లలో అరగంట మాత్రమే నాతో పవన్‌ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా… చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడుతున్నారు. చంద్రబాబునో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు. అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు. సామాజిక న్యాయం గురించి పవన్‌ కు ఏమాత్రం తెలియదు. జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. ఆయన నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు. సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా. మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక… ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని… పదవికి రాజీనామా ఈ ఉదయమే పంపించానని, ’’ అని సూర్యప్రకాష్‌ అన్నారు.

Joinings in YSRCP – 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేసా !

ఈ సందర్భంగా పులివెందుల నేత సతీష్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘నేను 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేసాను. నాతో వైసీపీ(YSRCP) నేతలు టచ్‌లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది. ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది. వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారు’’ అని సతీష్‌రెడ్డి చెప్పారు.

Also Read : Suneetha Narreddy: సీఎం జగన్ పై వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!