ఆఫ్గనిస్తాన్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. తన సారథ్యంలో నిర్వహిస్తున్న
పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలంలో తమ దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొన బోరంటూ ప్రకటించింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో వైమానిక దాడులు చేసిన తర్వాత గత సంవత్సరం చివరి నుండి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, ఇదిలా ఉండగా పీసీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్ స్పందించాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి కొంతమంది ఆటగాళ్ళు జాబితాలో ఉన్నారని, కానీ ఏ ఫ్రాంచైజీ వారిని ఎంపిక చేయలేదని అన్నారు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 11వ ఎడిషన్కు ముందు జరిగిన మొట్ట మొదటి ఆటగాళ్ల వేలం నుండి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. లాహోర్లో జరిగిన వేలానికి ముజీబ్ ఉర్ రెహమాన్, సెద్దికుల్లా అటల్, ముహమ్మద్ నబీ, వకార్ సలాంఖైల్, ఫజల్ హక్ ఫరూఖీ వంటి ఆటగాళ్ళు నమోదు చేసుకున్నారని ఫ్రాంచైజ్ యజమాని మొదట్లో ధృవీకరించారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ను పెషావర్ జల్మి నేరుగా సంతకం చేయడంపై వ్యతిరేకత నేపథ్యంలో వారు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వచ్చింది ఆఫ్గనిస్తాన్ నుంచి.
