ఇరాన్ : ఓ వైపు ఒప్పందం చేసుకున్నా ఇంకో వైపు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. మరో వైపు అమెరికా దాడులకు దిగింది. తాజాగా హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై దాడి చేసింది ఇరాన్. దీనికి ప్రతీకారంగా అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ స్థావరాలపై అమెరికా అటాక్ ప్రారంభించింది. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలు, తీరప్రాంత రాడార్ స్థావరాలపై సైన్యం దాడి చేసిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. హోర్ముజ్ జలసంధి వెంబడి బందర్ అబ్బాస్లో నౌకలు లంగరు వేసి ఉండటం కనిపిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో ఒక రోజు ముందు సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా దాడి చేసినట్లు పేర్కొంది యుఎస్. ఈ రెచ్చగొట్టే చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
డ్రోన్ దాడికి అమెరికా ప్రతిస్పందిస్తుందా లేదా అనేది “మీకే తెలుస్తుంది” అని ట్రంప్ విలేకరులతో చెప్పిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ ఒప్పందానికి నిరసనగా బీరుట్ వీధుల్లోకి వచ్చిన హిజ్బుల్లా మద్దతుదారులు ప్రకటన నిన్న వారు కాల్పులు జరపడం, నిజానికి నాలుగు సార్లు జరపడం నాకు నచ్చలేదు అని అమెరికా ప్రతీకార దాడికి కొద్దిసేపటి ముందు వైట్ హౌస్లో ట్రంప్ అన్నారు. టెహ్రాన్తో చర్చలు బాగా జరుగుతున్నాయని ట్రంప్ పదేపదే చెబుతున్నప్పుడు, దాడులు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. ఇరాన్ గురించి ట్రంప్ కలుగ చేసుకుని వారు మాకంటే భిన్నమైన వారంటూ పేర్కొన్నారు.
ఆ మార్గాన్ని ఉపయోగించడం ఆపాలని నౌకలను ఇరాన్ బెదిరించిన కొన్ని గంటల తర్వాత, ఒమన్ తీరంలో ఒక కంటైనర్ నౌకపై క్షిపణి దాడి జరిగిందని బ్రిటిష్ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది.
