న్యూఢిల్లీ : వివాదాస్పద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కు ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆమోదించిన వాదనలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు అని పేర్కొంటూ న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, ఎస్.వి.ఎన్. భట్టిలతో కూడిన ధర్మాసనం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టి వేసింది. ఐఏఎంసీకి అనుకూలంగా ఇచ్చిన భూ కేటాయింపును పక్కన పెడుతూ జూన్ 2025లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గతంలో ఈ కేసు విచారణ నుండి తప్పుకున్నారు.
డిసెంబర్ 2021లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణతో పాటు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించినప్పటి నుండి ఈ స్థలానికి సంబంధించి హైదరాబాద్ వివాదంలో చిక్కుకుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్. నాగేశ్వరరావు, హిమా కోహ్లీ, అప్పటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ పాల్గొన్నారు. వీరందరూ హైదరాబాద్ ట్రస్టీల బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే న్యాయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఐఏఎంసీ పదవీ విరమణ తర్వాత లాభదాయకమైన పదవులను కల్పిస్తోందన్న సూచనను కన్నన్ , శంకరనారాయణన్ ఇద్దరూ తోసిపుచ్చారు. ఇది సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి 2021లో ఏర్పాటు చేయబడిన ఒక పబ్లిక్ ట్రస్ట్ అని, దీనికి తెలంగాణ ప్రభుత్వం నుండి మౌలిక సదుపాయాల మద్దతు ఉందని, అయితే దాని కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం లేదని వారు నొక్కి చెప్పారు. 2023 సెప్టెంబర్లో సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ తో ఒక అవగాహన ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత, పంచూ ఎస్ఐఎంసీ ప్యానెల్ నుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రమణ సభ్యుడిగా ఉన్న ఏ ప్యానెల్లోనూ నేను ఉండాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. అంతే కాదు అతన్ని ఆదరించే ఏ సంస్థలోనూ భాగం కావాలను కోవడం లేదన్నారు.
