Temjem Imna Along : ‘రాజ‌ధాని ఎక్స్ ప్రెస్’ విందు ప‌సందు – ఇమ్నా

నెట్టింట్లో వైర‌ల్ గా మారిన టెమ్జెమ్ అలోంగ్ ఫోటోలు

Temjem Imna Along : ఎవ‌రీ టెమ్జెమ్ ఇమ్నా అనుకుంటున్నారా. నాగాలాండ్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్నారు. మ‌నోడు ఏం చేసినా అదో సెన్సేష‌న్. అంత‌లోనే వైర‌ల్ కావ‌డం అన్న‌ది య‌థావిధిగా మారింది.

తాజాగా మ‌రోసారి సోష‌ల్ మ‌డియాలో హాట్ టాపిక్ గా మారారు టెమ్జెమ్ ఇమ్నా అలోంగ్. రాజ‌ధాని ఎక్స్ ప్రెస్ లో త‌న‌కు అందించిన భోజ‌నానికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు.

నెట్టింటిని షేక్ చేస్తున్నాయి ఫోటోలు. ప్ర‌స్తుతం ఆయ‌న ఉన్న‌త విద్య‌, గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

త‌ను మంత్రి ప‌ద‌విలో ఉన్ప‌ప్ప‌టికీ, సెక్యూరిటీ, వాహ‌నాలు అందుబాటులో ఉన్నా ప్ర‌యాణీకుల ఇబ్బందులు ఏమిటో తెలియ చేసుకునేందుకు గాను మ‌నోడు రైలులో ప్ర‌యాణం చేశాడు.

ఈ స‌మ‌యంలో త‌న‌కు భోజ‌నం వ‌డ్డించారంటూ ఇన్మా అలోంగ్ (Temjem Imna Along) ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. గౌహ‌తి నుంచి దిమాపూర్ కు వెళుతుండ‌గా ఈ అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది.

నేను అనుకోకుండా ప్ర‌యాణం చేశా. ఈ స‌మ‌యంలో జ‌ర్నీ నాకు అత్యంత ఆనందాన్ని క‌లిగించింది. రాజ‌ధాని ఎక్స్ ప్రెస్ వారందించిన విందు అద్భుతంగా ఉందంటూ టెమ్జెమ్ ఇమ్నా అలోంగ్ కితాబు ఇచ్చాడు.

మంచి రుచిక‌ర‌మైన భోజనాన్ని అందించినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొన్నారు ఉన్న‌త విద్య‌, గిరిజ‌న విద్యా శాఖ మంత్రి. చపాతీలు, కూర‌గాయ‌లు, పెరుగు సూప‌ర్ అంటూ ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా రైల్వే శాఖ స‌హాయ మంత్రి విలువైన అభిప్రాయాన్ని పంచుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Also Read : కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ

Leave A Reply

Your Email Id will not be published!