Congress Strategy : పైలట్ ను పక్కన పెట్టేశారా
రాజస్థాన్ సీఎం దూకుడు
Congress Strategy : కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్(Sachin Pilot) ను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది(Congress Strategy. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో స్వంత పార్టీ సర్కార్ పైనే ఆయన నిరసన గళం వినిపించారు. ఆపై సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, ఆరోపణల గురించి తెలిసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ తమ పార్టీకి చెందిన సీఎం అశోక్ గెహ్లాట్ ను ప్రశ్నించారు. దీనిపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఏదైనా ఉంటే పార్టీ సమావేశాల్లో చెప్పాలని కానీ ప్రజల్లో, మీడియా ముందుకు వెళ్ల కూడదని చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లో ఎన్నికల వేడి మొదలైంది. అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు, హామీలతో హోరెత్తిస్తున్నారు. తమ సర్కార్ చేపట్టిన అభివృద్ది పనుల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు కేంద్ర పరిశీలకులు, ఇంఛార్జీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.
ఇప్పటికే సీఎం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఈ తరుణంలో పార్టీకి సపోర్ట్ గా ఉండాల్సిన సచిన్ పైలట్ ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండడాన్ని తీవ్రంగా తీసుకున్నారు సీఎం. ఈ మేరకు మెల మెల్లగా పక్కన పెడుతూ వచ్చారు.
Also Read : స్కాంలకు కేరాఫ్ కాంగ్రెస్ – బొమ్మై