Supreme Court : రెజ్ల‌ర్ల కేసుపై సుప్రీంకోర్టు విచార‌ణ‌

స‌ర్వ‌త్రా తీర్పుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

Supreme Court : ఓ వైపు నిర‌స‌న చేస్తున్న మ‌హిళా రెజ్ల‌ర్ల‌ను బ‌ల‌వంతంగా దాడికి దిగారు ఢిల్లీ ఖాకీలు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళ‌న నెల‌కొంది. ప‌లువురు ఖండించారు. ప‌రిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ ను కూడా ఖాకీలు విడిచి పెట్ట‌లేదు. దీనిపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న‌ను ఆమె గూండాగా అభివ‌ర్ణించారు.

ఇదిలా ఉండ‌గా మ‌హిళా రెజ్ల‌ర్లు త‌మ‌పై డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆపై ఢిల్లీ ఖాకీలు కేసు న‌మోదు చేయ‌డం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సీజేఐ చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం సీరియ‌స్ కామెంట్స్ చేసింది. వాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని, కేసు ఎందుకు న‌మోదు చేయ‌లేదంటూ ఢిల్లీ ఖాకీల‌కు నోటీసు జారీ చేసింది. దీంతో దెబ్బ‌కు దిగి వ‌చ్చారు. బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై రెండు కేసులు న‌మోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా త‌మ‌కు ఆయ‌న నుంచి ప్రాణ హాని ఉంద‌ని, వెంట‌నే డ‌బ్లూఎఫ్ఐ చీఫ్ నుంచి తప్పించాల‌ని కోరారు దాఖ‌లు చేసిన పిటిష‌న్ లో. గురువారం మే 4న సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ప్ర‌స్తుతం కోర్టులో వాదోప‌వాదాలు న‌డుస్తు్న్నాయి. కోర్టు ఏం తీర్పు ఇస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : ప‌వార్ వ్య‌వ‌హారం రాహుల్ జోక్యం

Leave A Reply

Your Email Id will not be published!