MS Dhoni : అభిమానుల‌ను చూస్తే ఆడాల‌నిపిస్తోంది

టైటిల్ గెలిచాక మీడియాతో ఎంఎస్ ధోనీ

MS Dhoni : చెన్నై సూప‌ర్ కింగ్స్ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే త‌న కెరీర్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ దిగ్గ‌జ ఆట‌గాడు ప్ర‌స్తుతం ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో కొన‌సాగుతున్నాడు. అత్యుత్త‌మమైన ఆట తీరుతో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్ 16వ సీజ‌న్ 2023 టైటిల్ ను కైవ‌సం చేసుకుంది. 171 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ ను మ‌ట్టి క‌రిపించింది.

వ్య‌క్తిగ‌తంగా రాణించ‌లేక పోయినా స‌మిష్టిగా సీఎస్కే దుమ్ము రేపింది. అద్బుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై అరుదైన రికార్డ్ న‌మోదు చేయ‌డం విశేషం.

మ్యాచ్ అనంత‌రం చెన్నై సూప‌ర్ కింగ్స్ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడారు. హ‌ర్ష బోగ్లే అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు మ‌హేంద్ర సింగ్ ధోనీ. వ‌య‌సు మీద ప‌డుతోంది. ఆడాలంటే ఒకింత ఇబ్బంది అవుతోంది. కానీ ల‌క్ష‌లాది మంది అభిమానులు కురిపిస్తున్న ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను చూసి తాను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని దీంతో మ‌రోసారి ఆడాల‌న్న కోరిక త‌న‌కు క‌లుగుతోంద‌న్నాడు

ఎంఎస్ ధోనీ. ఎంత గొప్ప ఆట‌గాడైనా ఏదో ఒక రోజు విర‌మ‌ణ చెప్పాల్సిందే. దీంతో ఈసారి సీజ‌న్ ఆఖ‌రిద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇంకాస్త టైం ఉంది కాబ‌ట్టి ఇప్పుడే ఏమీ చెప్ప‌లేన‌న్నాడు ధోనీ.

Also Read : MS Dhoni Emotional 

 

Leave A Reply

Your Email Id will not be published!