ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం

చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు పోరాడిన ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టు

ముంబై : క్రికెట్ ఆట‌లో ఉన్న మ‌జా ఏమిటో ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ తెలియ చేసింది. అందుకే కోట్లాది మంది క్రికెట్ అంటే ప‌డి చ‌స్తారు. నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగిన ఈ కీల‌క పోరు చివ‌రి ఓవ‌ర్ దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. ఇక కేవ‌లం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచి ఉంది టీం ఇండియా. తొలి సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాకు చుక్క‌లు చూపించింది న్యూజిలాండ్. ఆ జ‌ట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైన‌ల్ కు చేరుకుంది. ఈనెల 8న భార‌త్ తో త‌ల‌ప‌డ‌నుంది. దీంతో కోట్లాది మంది భార‌తీయులు ఈ కీల‌క పోరు కోసం వేచి చూస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ ఓడిన భార‌త్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 253 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. కేర‌ళ స్టార్ శాంస‌న్ మ‌రోసారి రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. ప్ర‌త్యేకించి జోఫ్రా ఆర్చ‌ర్ ను ఉతికి ఆరేశాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. 89 ప‌రుగులు చేసిన త‌ను 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు కొట్టాడు. త‌న‌కు తోడుగా ఇషాన్ కిష‌న్, హార్దిక్ పాండ్యా, తిల‌క్ వ‌ర్మ‌, శివ‌మ్ దూబేలు కీల‌క పాత్ర పోషించారు. ఇరు జ‌ట్లు 499 ర‌న్స్ చేశాయి. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. భార‌త బౌల‌ర్లు ప్ర‌త్య‌కించి బుమ్రా, ప‌టేల్, పాండ్యాలు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఇండియాను ఒడ్డుకు చేర్చారు.

Leave A Reply

Your Email Id will not be published!