హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర సమాచార కమిషన్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినందుకు హైకోర్టు తప్పుబట్టింది. సంబంధిత ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బాధితుడు చట్టంలోని సెక్షన్ 18(1) కింద టీజీఐసీని ఆశ్రయించారు. : కారుణ్య నియామకం కోసం ఒక దరఖాస్తుదారుడి ప్రతిపాదన స్థితికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి తెలంగాణ సమాచార కమిషన్ (టీజీఐసీ) నిరాకరించింది. ఈ సందర్బంగా ఉత్తర్వును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. టీజీఐసీ ఉత్తర్వు సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి జారీ చేయబడిందని కోర్టు పేర్కొంది. 2005 సమాచార హక్కు చట్టం కింద తన ఫిర్యాదును మూసి వేయడాన్ని సవాలు చేస్తూ బొడ్డుపల్లి శంకరయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్ను జస్టిస్ సురేపల్లి నంద విచారించారు.
పిటిషనర్ 2008లో సమర్పించిన తన కారుణ్య నియామక ప్రతిపాదన స్థితికి సంబంధించిన సమాచారాన్ని కోరారు. సంబంధిత ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ,బాధితుడు చట్టంలోని సెక్షన్ 18(1) కింద టీజీఐసీని ఆశ్రయించారు. కోరిన సమాచారం అందించ బడిందనే కారణంతో కమిషన్ ఫిర్యాదును మూసి వేసింది. విచారణ సమయంలో పిటిషనర్ హాజరు కాలేదని కూడా నమోదు చేయబడింది. ఆగస్టు 29న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆగస్టు 19, 2025న జారీ చేసిన నోటీసు, విచారణ అప్పటికే జరిగిపోయిన తర్వాత, సెప్టెంబర్ 3, 2025న మాత్రమే పిటిషనర్కు అందిందని హైకోర్టు ముందు వెలుగులోకి వచ్చింది. పిటిషనర్కు సహేతుకమైన విచారణ అవకాశం నిరాకరించ బడిందని వ్యాఖ్యానించారు.
నోటీసు జారీ చేయడంలో ఆలస్యం కారణంగా, పిటిషనర్ హాజరును నిర్ధారించుకోకుండా ఉత్తర్వు జారీ చేయడం సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనకు పాల్పడటమేనని కోర్టు పేర్కొంది. పిటిషనర్కు తెలియకుండా జారీ చేసిన అటువంటి ఉత్తర్వు ఏకపక్షమైనదని మరియు చట్టబద్ధంగా నిలబడలేనిదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
